
.
రావులపాలెం: దసరాకు ప్రత్యేక మైసూర్ యాత్ర ఏర్పాటు చేసినట్టు స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ వైవీవీఎన్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఎనిమిది రోజుల టూర్గా ఈ యాత్రను రూపొందించామన్నారు. సెప్టెంబర్ 24న బయలుదేరి మంత్రాలయం, హంపి, గోకర్ణం, మురుడేశ్వర్, మూకాంబిక, ఉడిపి, శృంగేరి, హార్నాడు, ధర్మస్థలం, కుక్కే సుబ్రహ్మణ్యం, శ్రీరంగపట్నం, మైసూర్ అరుణాచలం మీదుగా అక్టోబర్ ఒకటో తేదీన తిరిగి రావులపాలెం చేరుతుందన్నారు. ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతోపాటు ఈ యాత్రకు ఒక టిక్కెట్ ధర రూ.8500 నిర్ణయించామన్నారు. ఈ యాత్రకు అడ్వాన్స్ టికెట్లు, ఇతర వివరాలకు అసిస్టెంట్ మేనేజర్ కార్యాలయంలో 73829 11871 నంబరును సంప్రదించాలన్నారు.