అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

Aug 5 2025 6:36 AM | Updated on Aug 5 2025 6:36 AM

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

మహబూబాబాద్‌ రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్‌ చేసినట్టు మహబూబాబాద్‌ డీఎస్పీ ఎన్‌.తిరుపతిరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం మహబూబాబాద్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. టౌన్‌ ఎస్సై కె.శివ తన సిబ్బందితో కలిసి నర్సంపేట బైపాస్‌లో వాహనాల తనిఖీ చేస్తుండగా, బైక్‌పై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తారసపడ్డాడు. పోలీసులు ఆపగా, పారిపోయేందుకు యత్నించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం ఎస్సీ పేట దేవీచౌక్‌కు చెందిన గొర్రెల చిన్నబాబుగా గుర్తించారు. గత మే 31న డోర్నకల్‌లో ఓ బైక్‌, మహబూబాబాద్‌లోని రామచంద్రాపురంలో 4.5 గ్రాముల బంగారం, 8 గ్రాముల వెండి ఆభరణాలు, ఆర్టీసీ కాలనీలో 4 గ్రాముల వెండి ఆభరణాలను అతడు తస్కరించాడు. చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట, కోదాడ పట్టణాల్లో కూడా రెండు చోరీలకు పాల్పడినట్టు అతడు అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement