
జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా బాలరాజు
నిడదవోలు : వైఎస్సార్ సీపీ జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా ప్రస్తుత నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్ యలగాడ బాలరాజు ఎంపికయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నిడదవోలు నియోజకవర్గానికి చెందిన బాలరాజుని ఎంపిక చేసినట్లు బుధవారం వెల్లడించారు. 2014 నుంచి వైఎస్సార్ సీపీకి విధేయుడిగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం బాలరాజు కృషి చేశారు. 2014లో పట్టణంలో 13వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి కౌన్సిలర్గా గెలుపొందారు. తిరిగి 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. దీంతో వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాసనాయుడు రెండవ మున్సిపల్ వైస్ చైర్మన్గా అవకాశం కల్పించారు. నిజాయితీ, నిబద్ధతతో పార్టీ కోసం పనిచేస్తున్న బాలరాజుకి సముచిత స్ధానం కల్పిస్తూ జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా నియమించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బాలరాజు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానన్నారు. తనపై ఎంతో నమ్మకంతో జిల్లా స్థాయి పదవి ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.