
ఇంజినీరు పోస్టులు ఖాళీగా ఉండడం ఆందోళనకరం
రాజమహేంద్రవరం సిటీ : ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ పంపిణీ సంస్థలతో సహ ట్రానన్స్కో, జెన్ కోతో కలుపుకుని క్షేత్రస్థాయిలో వెయ్యికి పైగా ఏఈల పోస్టులు ఖాళీగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కపల్లి శ్యామ్యూల్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాజమహేంద్రవరంలో జరిగిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజురోజుకి విద్యుత్ వినియోగం పెరుగుతున్న తరుణంలో అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉండడం లేదన్నారు. కీలకమైన ఏఈ స్థాయి అధికారుల యామకానికి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. 2022 పే రివిజన్ కారణంగా 1,800 మంది ఇంజినీర్లు ఇంక్రిమెంట్లు కోల్పోయారని సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని సమావేశం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నాగప్రసాద్, అసోసియేట్ సెక్రటరీ కె.వి.రామారావు, బ్రాంచి సెక్రటరీ రత్నాలరావు పాల్గొన్నారు.