
అలా స్పాగిపోతున్నారు..!
హెయిర్ కటింగ్తో ప్రారంభమై..
ముందుగా హెయిర్ కటింగ్తో కస్టమర్లను ఆకర్షించే నిర్వాహకులు కస్టమర్లు అడగకపోయినా హెడ్ మసాజ్ వంటివి చేస్తారు. వారు చూపిస్తున్న ఆసక్తిని బట్టి తమ వద్ద బాడీ మసాజ్ కూడా ఉందని చెబుతారు. అలా ముగ్గులోకి వచ్చిన కస్టమర్లతో మసాజ్ ప్రక్రియలో భాగంగా పరిచయం పెంచుకుంటారు. చీకటి మాటున జరిగే ఈ మసాజ్ ప్రక్రియలో ఫుల్ మసాజ్, బాడీ టూ బాడీ మసాజ్ వంటి పేర్లతో యువతులతో మగ కస్టమర్లను ఆకర్షిస్తారు. ఇలా ప్రత్యేక గదిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కూడా జరిగిపోతుంది. అలవాటు పడిన కస్టమర్లు వారానికి ఒకసారైనా ఇక్కడకు వస్తున్నారని అంటున్నారు. ఇటీవల ఓ మసాజ్ సెంటర్ నిర్వాహకురాలి ఫోన్లో బ్యూటీపార్లర్కు వచ్చే ఆడవారికి మగ వ్యభిచారులను కూడా సమకూరుస్తున్నట్టు రికార్డింగ్ బయటపడటం విష సంస్కృతికి అద్దంపడుతోంది.
ఫ మసాజ్ పేరుతో మగువలతో వల
ఫ రాజమహేంద్రవరంలో స్పా సెంటర్లు
ఫ గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం
ఫ దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం
కంబాలచెరువు: (రాజమహేంద్రవరం): సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో నయా సంస్కృతి మొదలైంది. ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు వంటి కాస్మోపాలిటిన్ నగరాల్లో ఉండే స్పా సెంటర్ల కల్చర్ ఇక్కడకు విస్తరించింది. మసాజ్ పేరుతో హైటెక్ వ్యభిచారం అధికమైంది. ఉపాధి పేరుతో ఆయా స్పా సెంటర్లలో చేరిన యువతులను నిర్వాహకులు పడుపు వృత్తిలోకి దింపుతున్నారు. ఏడాది కాలంలో నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న సుమారు 14 స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేసి పట్టుకోవడం చూస్తే.. జిల్లాలో చాపకింద నీరులా విష సంస్కృతి పెరిగిందని చెప్పకనే అర్థమవుతోంది.
ఎక్కడే ఎందుకంటే..
రాజమహేంద్రవరంలో ధనిక వర్గాలు ఎక్కువగా ఉండే ఏవీ అప్పారావు రోడ్డు, జేఎన్ రోడ్డు, దానవాయిపేట వంటి ప్రాంతాల్లో ఇటీవల స్పా సెంటర్లు పెరుగుతున్నాయి. నిరుద్యోగ యువత ఉపాధి వేటలో భాగంగా బ్యూటీ కోర్సులు, మసాజ్ కోర్సులు వంటివి చేసి స్పా సెంటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యాపారం బాగుంటుండటంతో అసాంఘిక శక్తులు ఈ రంగంలోకి ప్రవేశించి పెట్టుబడి పెడుతూ తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాందించేందుకు పథక రచన చేస్తున్నారు. బ్యూటీపార్లర్లతో కూడిన మసాజ్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే కస్టమర్లను వ్యభిచారం వైపు లాగుతున్నారు. ఆయా సెంటర్లకు వెళ్లే విటులలో ఎక్కువ వ్యాపార వర్గాలు, యువత ఉంటున్నారు. కొద్దినెలల కిందట ఏవీ అప్పారావు రోడ్డులో పట్టుబడిన స్పా సెంటర్ నిర్వాహకురాలు బ్యూటీ పార్లర్లకు వచ్చే మహిళలకు వారి అభిరుచి మేరకు మగ వ్యభిచారులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఓ వాయిస్ రికార్డింగు బయటపడటం చూస్తే పరిస్థితి చేయిదాటిందని అర్థమవుతోంది. ఎక్కడో మెట్రోపాలిటిన్ సిటీల్లో బయటపడే ఇటువంటి ఘటనలు జిల్లాలో విస్తరించడం చూస్తే అసాంఘిక శక్తులు ఏ మేరకు చొచ్చుకు వస్తున్నాయో స్పష్టమవుతోంది.
ఉద్యోగం పేరుతో రొంపిలోకి
బ్యూటీపార్లర్, సెలూన్, స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారాలు ప్రారంభించే నిర్వాహకులు ముందుగా బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి మసాజ్ సెంటర్లలో అనుభవం ఉన్న ఒకరిద్దరు యువతులను ఆకర్షణీయమైన ప్యాకేజీతో నియమించుకుంటారు. జన సంచారం తక్కువగా ఉండే ధనిక వర్గాలు నివసించే ప్రాంతాల్లో అట్టహాసంగా స్పా, సెలూన్ సెంటర్లు ప్రారంభించి రిసెప్షన్, హెల్పర్ల పేరుతో అందమైన యువతులను పనిలో పెట్టుకుంటారు. ముందే అనుభవం ఉన్న యువతులు కొత్తగా చేరిన వారితో సన్నిహితంగా ఉంటారు. వారికి ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తూ తమవైపు తిప్పుకుంటారు. వారి అవసరాలకు డబ్బులు ఇస్తూ పూర్తిగా వీరి ఉచ్చులో పడే విధంగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. కొత్తగా చేరిన యువతులకు పాత యువతులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తూ వారిని కూడా మసాజ్ ప్రక్రియకు ఉపయోగించుకుని కమీషన్ ఇస్తారు. నిర్వాహకులు ఆ యువతులతో చనువుగా ఉంటూ ఫోటోలు దిగడం చేస్తుంటారు. అవి నిర్వాహకుల వద్ద ఉండటంతో ఆ యువతులు పూర్తిగా విధేయతతో ఉంటారు. వారితో గొడవ పెట్టుకునేందుకు సాహసించరు. ఇలా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం సాగిపోతోంది.
ఏడాదిలో 14 సెంటర్లపై దాడి
ఏడాది కాలంలో జిల్లాలోని రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మసాజ్ సెంటర్లు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లలో అసాంఘిక కార్యకలాలు నిర్వహిస్తున్న 14 సెంటర్లపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. అక్కడ దొరికే యువతులను సాక్షులుగా పరిగణిస్తూ విటులపై, నిర్వాహకులపై కేసులు నమోదు చేశాం. స్పాలు, బ్యూటీపార్లర్లపై నిరంతరం నిఘా పెడుతున్నాం. ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా సమాచారం ఇవ్వాలి.
–డి.నరసింహకిశోర్, ఎస్పీ, తూర్పుగోదావరి జిల్లా

అలా స్పాగిపోతున్నారు..!

అలా స్పాగిపోతున్నారు..!