
ఇసుక డ్రెడ్జింగ్ పడవలు సీజ్
తాళ్లపూడి (కొవ్వూరు): ఇసుక ర్యాంపుల్లో ఇసుక డ్రెడ్జింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత హెచ్చరించారు. కొవ్వూరు గామన్ బ్రిడ్జి సమీపాన దండగొండ ర్యాంపులో రెండు ఇసుక డ్రెడ్జింగ్ పడవలను సోమవారం అధికారులు సీజ్ చేశారు. గోదావరి నదీగర్భంలో పడవలతో డ్రెడ్జింగ్ చేస్తూ యథేచ్ఛగా ఇసుక తవ్వుకుపోతూండటంపై ‘కొల్లగొట్టేస్తున్నారు..’ శీర్షికన గత నెల 31న ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఇరిగేషన్, టాస్క్ఫోర్స్ అధికారులు ర్యాంపులో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డ్రెడ్జింగ్కు ఉపయోగిస్తున్న రెండు బోట్లను పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ర్యాంపులో ఉన్నవారిని ఆర్డీఓ రాణి సుస్మిత వివరాలడిగి తెలుసుకున్నారు. అయితే, ఈ పడవలు గురించి తమకు తెలియదని అక్కడి వారు చెప్పడం గమనార్హం. దండగొండ ర్యాంపులో అధికారుల దాడి నేపథ్యంలో మిగిలిన ర్యాంపుల్లో కూడా డ్రెడ్జింగ్ నిలిపివేయడం గమనార్హం.
పీజీఆర్ఎస్కు 279 అర్జీలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 279 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ పి.ప్రశాంతి, డీఆర్ఓ సీతారామమూర్తి తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పీజీఆర్ఎస్తో పాటు మీసేవా పోర్టల్, 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చే అర్జీలను అంతే ప్రాధాన్యంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చిన అర్జీల్లో రెవెన్యూ 202, పోలీసు 14, ఇతర శాఖలవి 28 ఉన్నాయన్నారు. మిగిలినవి ఇతర సమస్యలపై వచ్చాయన్నారు.
పోలీస్ పీజీఆర్ఎస్కు
25 అర్జీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం(పీజీఆర్ఎస్)కు 25 అర్జీలు వచ్చాయి. అడిషనల్ ఎస్పీలు ఎంబీఎం మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజులు అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని అదేశించారు.
ఈగల్ టోల్ఫ్రీ నంబర్
1972పై విస్తృత ప్రచారం
కాకినాడ సిటీ: మత్తు పదార్థాల నివారణ, సహాయానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఫోర్స్మెంట్)కు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్మీనా, డీఆర్వో వెంకటరావు, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ తదితరులు కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు.

ఇసుక డ్రెడ్జింగ్ పడవలు సీజ్

ఇసుక డ్రెడ్జింగ్ పడవలు సీజ్