రైల్వే బ్రిడ్జిల పరిరక్షణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

రైల్వే బ్రిడ్జిల పరిరక్షణకు చర్యలు

Jun 4 2025 12:14 AM | Updated on Jun 4 2025 12:14 AM

రైల్వే బ్రిడ్జిల పరిరక్షణకు చర్యలు

రైల్వే బ్రిడ్జిల పరిరక్షణకు చర్యలు

రాజమహేంద్రవరం సిటీ: గోదావరి నదిపై గల ప్రతిష్టాత్మకమైన రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జి, ఆర్చ్‌ బిడ్జిల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు అడిషనల్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ పీఈ ఎడ్విన్‌ పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరంలో గల రెండు బ్రిడ్జిలను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వే వంతెనలపై జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల నాణ్యత, భద్రతా తనిఖీని నిర్వహించామన్నారు. 2027 నాటికి సురక్షితమైన, బలమైన వంతెనలుగా తీర్చిదిద్దడానికి, రూ.115 కోట్ల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జ్‌ పై సురక్షితమైన ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఐకానిక్‌ ఆర్చ్‌ బ్రిడ్జ్‌పై రూ.70 కోట్లతో కేబుల్‌ రీ ప్లేస్మెంట్‌ వర్క్‌ పూర్తి చేస్తున్నామన్నారు. భారతీయ రైల్వేలతో అవగాహన ఒప్పందం కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల మద్దతును ఆశిస్తున్నామన్నారు. పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement