
అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలకు జట్టు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విజయనగరం జిల్లాలో 4 నుంచి 7 వరకు జరిగే ఏసీఏ నార్త్ జోన్ క్రికెట్ పోటీలలో పాల్గొనే పురుషుల జిల్లా జట్టు ఎంపి కను మంగళవారం నిర్వహించినట్లు తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. స్థానిక ఆర్ఎంసీ క్రీడామైదానంలో నిర్వహించిన సెలెక్షన్స్లో 15 మందిని ఎంపిక చేశామన్నారు. ఈ నెల 9 నుంచి 12 వరకు జరిగే ఏసీఏ నార్త్ జోన్ మ హిళల అంతర్ జిల్లా క్రికెట్ పోటీలకు జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపికను నిర్వహించామని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులకు జిల్లా క్రికెట్ సంఘం తరఫున క్రీడాదుస్తులు అందజేశామని తెలిపారు.

అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలకు జట్టు ఎంపిక