రోడ్డు ప్రమాదంలో భర్త మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

Jun 1 2025 12:14 AM | Updated on Jun 1 2025 12:14 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

భార్యకు తీవ్ర గాయాలు

రాజానగరం: జాతీయ రహదారిపై రాజానగరం ఏడీబీ రోడ్డు జంక్షన్‌ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరు గ్రామానికి చెందిన బిక్కన సత్యభాస్కరరావు (69), అతని భార్య పాపాయమ్మతో కలసి స్కూటీపై పెద్దాపురం మండలం కట్టమూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఏడీబీ రోడ్డు జంక్షన్‌ వద్ద మలుపు తిరుగుతుండగా, వీరి వెనుక నుంచి వ్యాన్‌ వచ్చి ఢీకొంది. దీంతో సత్యభాస్కరరావు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్యకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతానికి

వ్యక్తి మృతి

సఖినేటిపల్లి: ఉయ్యూరువారి మెరక గ్రామంలోని పైలాన్‌ సెంటర్లో శనివారం విద్యుత్‌ షాక్‌కు గురై దింపు కార్మికుడు బూసి నాని (28) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఒక రైతు పొలంలో నాని కొబ్బరి దింపు తీస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. చెట్టుకు సమీపంలోని 11 కేవీ విద్యుత్‌ లైనుకు చేరిఉన్న కొబ్బరి ఆకును తొలగించే క్రమంలో ప్రమాదశాత్తూ విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. దీంతో మృతి చెందిన నాని చెట్టుపైనే మోకుతో వేలాడుతూ ఉండిపోయాడు.

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి 
1
1/2

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి 
2
2/2

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement