ఇసుక అక్రమ తవ్వకాలపై సమాచారం | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ తవ్వకాలపై సమాచారం

Jun 1 2025 12:14 AM | Updated on Jun 1 2025 12:14 AM

ఇసుక అక్రమ తవ్వకాలపై సమాచారం

ఇసుక అక్రమ తవ్వకాలపై సమాచారం

సీతానగరం: మండలంలోని సింగవరం ర్యాంపు వద్ద ఇసుక అక్రమ తవ్వకాలపై చైన్నె, ఢిల్లీలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌కు మెయిల్‌ ద్వారా సమాచా రం ఇచ్చానని వంగలపూడికి చెందిన మాజీ సైనికుడు, న్యాయ వాది సూరెడ్డి శివకుమార్‌ తెలిపారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం అర్ధరాత్రి వంగలపూడి ర్యాంపు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీలను అడ్డుకుని, వాటిని వీడియోలు, ఫొటోలు తీసి జిల్లా కలెక్టర్‌, ఏడీ మైన్స్‌, తహసీల్దార్‌, ఎస్సైలకు సామాజిక మాధ్య మాల ద్వారా తెలియపర్చానని తెలిపారు. దీంతో ఎస్సై స్పందించి లారీలను నిలిపివేశారని అన్నారు. శనివారం ఉదయం మైన్స్‌ ఏడీ నుంచి లిఖిత పూర్వక మెసేజ్‌ ఇచ్చారని, అందులో జిల్లా కలెక్టర్‌కు గాని, తనకు గాని సంబంధం లేదని తెలిపారన్నారు. అనకాపల్లి కలెక్టర్‌, మైన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు మాత్రమే సంబంధం ఉందని తెలియపర్చారని వివరించారు. జిల్లాలో తవ్వకాలపై వారికి సంబంధం లేదని అనడం హాస్యాస్పదంగా ఉందని, ఎన్జీటీకి తెలిపర్చిన తరువాత తనకు సమాచారం అందించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. సింగవరం లంక భూముల్లో తవ్వకాలు జరపాల్సి ఉండగా, వంగలపూడి లంక భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి, సింగవరం ర్యాంపు నుంచి కాకుండా వంగలపూడి ర్యాంపు నుంచి ఇసుక లారీలపై తరలిస్తున్నారని అన్నారు. సోమవారం గ్రామస్తులంతా లారీలను అడ్డుకుంటారని, అనకాపల్లి కలెక్టర్‌, ఏడీ మైన్స్‌ వారు వచ్చి పూర్తి వివరాలు తెలియజేసే వరకూ ఆ లారీలను అడ్డుకుంటామని శివకుమార్‌ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement