రైతు ప్రాణం తీసిన కలుపు మందు | - | Sakshi
Sakshi News home page

రైతు ప్రాణం తీసిన కలుపు మందు

Jun 1 2025 12:14 AM | Updated on Jun 1 2025 12:14 AM

రైతు

రైతు ప్రాణం తీసిన కలుపు మందు

నల్లజర్ల: పంట పొలాల్లో కలుపు నివారణకు వినియోగించే గడ్డి మందు ఓ యువ రైతు ప్రాణం తీసింది. ఆ వివరాల ప్రకారం.. మండలంలోని చీపురుగూడెం గ్రామానికి చెందిన యువ రైతు చెల్లు లీలాకృష్ణ ప్రసాద్‌ (30) పదిహేను రోజుల కిందట పొలాల్లో కలుపు నివారణకు ఇంటి వద్ద ఉన్న గడ్డి మందు డబ్బాను పొలానికి తీసుకెళ్లాడు. ఆ డబ్బాను బైక్‌ ముందు కవర్‌లో పెట్టాడు. మార్గ మధ్యంలో డబ్బా మూత లీకై అతని ప్యాంట్‌పై పడింది. ఏమీకాదులే అని కడిగేసుకుని ఆ మందు స్ప్రే చేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఒక్కరోజు వ్యవధిలోనే ఒంటిపై పడిన మందు ద్రావణం వృషణాల నుంచి శరీరంలోని కిడ్నీ, లివర్‌ తదితర అవయవాలకు సోకింది. అతను తొలుత ఏలూరు, తర్వాత విజయవాడ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు మృతుడి తండ్రి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఏడాది క్రితమే ప్రసాద్‌కు ఆవపాడుకు చెందిన మౌనికతో వివాహం కాగా, ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. ప్రసాద్‌ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

అటవీ భూమిలో చెట్ల నరికివేత

గోపాలపురం: మండలంలోని కోమటికుంట అటవీ భూమిలో ఉన్న చెట్లు నరికివేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు రెండు ట్రాక్టర్ల పుల్లలను స్వాధీనం చేసుకున్నామని డీఆర్‌ఓ కె.వేణుగోపాల్‌ శనివారం విలేకరులకు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. అటవీ శాఖకు చెందిన భూమిలో ఉన్న వేప, జీడిమామిడి చెట్లు అక్రమార్కులు నరుకుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. అక్కడ రెండు ట్రాక్టర్లతో ఉన్న సుమారు 12 టన్నుల పుల్లలను స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసినట్లు డీఆర్‌ఓ తెలిపారు.

రైతు ప్రాణం తీసిన కలుపు మందు 1
1/1

రైతు ప్రాణం తీసిన కలుపు మందు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement