మాటతీరు తెలిసిన మర్యాదాపురుషోత్తముడు | - | Sakshi
Sakshi News home page

మాటతీరు తెలిసిన మర్యాదాపురుషోత్తముడు

Apr 17 2025 12:16 AM | Updated on Apr 17 2025 12:16 AM

మాటతీరు తెలిసిన మర్యాదాపురుషోత్తముడు

మాటతీరు తెలిసిన మర్యాదాపురుషోత్తముడు

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): ‘‘ పెద్దలతో ఎలా మాట్లాడాలో మనం రాముని మాటతీరును పట్టి తెలుసుకోవాలి, ఆయన మర్యాదాపురుషోత్తముడు, వినయాది సద్గుణశోభితుడు’’ అని వాగ్దేవీవరపుత్ర సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం టీనగర్‌లోని హిందు సమాజంలో ఆయన ఉత్తరకాండపై రెండవ రోజు ప్రవచనాన్ని కొనసాగించారు. సీతాసమేతుడయి కొలువుతీరిన రామచంద్రుని దర్శనార్థం మహర్షులు తరలి వచ్చా రు. రాక్షస పీడను తొలగించినందుకు శ్రీరాముని కొనియాడుతూ, వారు ఇంద్రజిత్తు గురించి పదేపదే ప్రస్తావించడంతో రామునిలో కుతూ హలం పెరిగింది. ‘మహాత్ములారా! మీరు ప్రత్యేకించి ఇంద్రజిత్తు గురించి ప్రస్తావించడానికి కారణం తెలుసుకోగోరతాను. అది రహస్యం కాకపోతే, తెలుసుకునే యోగ్యత నాకు ఉన్నదని మీరు భావిస్తే, నాకు తెలియచెప్పమని శ్రీరాముడు అడిగాడు, మునులు ఇంద్రజిత్తు తపస్సు, వాడు పొందిన వరాల గురించి చెబుతూ, వాడిని వధించడం విశేష మన్నారు. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. ఇంద్రజిత్తును వధించినది లక్ష్మణుడు అయితే, రాముని ప్రశంసించడంలో ఔచిత్యమేమిటని. ‘శ్రీరాముడు సత్యసంధుడు, ధర్మాత్ముడు అయితే, ఈ అస్త్రం ఇంద్రజిత్తుని వధించుగాక’ అని లక్ష్మణుడు స్తోత్రం చేస్తూ ఉయోగించిన అస్త్రమే ఇంద్రజిత్తు ప్రాణాలను తీసిందని మనం విస్మరించరాదని సామవేదం అన్నారు. రామాయణంలో జ్యోతిషశాస్త్ర ప్రాశస్త్యం పలు సన్నివేశాలలో కనపడుతుంది, జ్యోతిషం వేదాంగం, ఒక ప్రామాణికమైన శాస్త్రమని సామవేదం అన్నారు. రావణుడు సీతను విందముహూర్తంలో అపహరించాడని, ఆ ముహూర్తంలో అపహరించినవాడికి ప్రాణాంతకం. అలాగే, రావణుని తల్లి కై కసి విశ్రవసుబ్రహ్మను ‘దారుణ’ముహూర్తంలో సమీపించి సంతానం కోరడం వల్ల ఆమెకు లోకకంటకుడయిన రావణుడు జన్మించాడని, ఆ తరువాత పుట్టిన విభీషణుడు ధర్మాత్ముడవుతాడని ఆయన కై కసిని ఓదార్చాడని సామవేదం అన్నారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయినప్పుడు, ‘మానవులు నాకు తృణప్రాయులు, మానవులను తప్పించి ఇత రుల చేతిలో నాకు మరణం కలగకూడదని రావణుడు కోరుకున్నాడు, ఎట్టి ఆపదలలోను నా బుద్ధి ధర్మతప్పకూడదని విభీషణుడు బ్రహ్మను కోరుకు న్నాడు. బ్రహ్మదేవుడు విభీషణునికి అమరత్వాన్ని ప్రసాదించాడు, రావణుడు అదే అమరత్వాన్ని ముందు కోరితే, ఆయన ఆ వరాన్ని ప్రసాదించలేదని సామవేదం అన్నారు. భాగవత విరించి డాక్టర్‌ టీవీ నారాయణరావు స్వాగత వచనాలు పలికారు.

వాగ్దేవీ వరపుత్ర సామవేదం షణ్ముఖశర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement