ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి గౌతమి గోదావరిలో స్వామి వారి జలవిహారం కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రాత్రి విద్యుద్దీపాలు, పూలతో అలంకరించిన హంస వాహనంపై మేళ తాళాలు, వివిధ రకాల బృందాల వాయిద్యాలు, భారీ బాణసంచా కాల్పుల నడుమ భక్తజన రంజకంగా జలవిహారం నిర్వహించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆలయ అర్చక కమిటీ సభ్యులు వాడపల్లి శేషావతారం, కమిటీ సభ్యులు సిష్టా సూర్య కుటుంబరావు, ఆలయ అర్చకులు, బృందం సభ్యులు పాల్గొన్నారు.


