
● ఇదేందయ్యా ఇది.. ఇదెప్పుడూ చూడలే..
వేసవి ఎండలు మండిపోతున్నాయి.. అందులోనూ సముద్ర తీరానికి కాస్త చేరువలో ఉన్న పిఠాపురం ప్రజలైతే ఓవైపు ఎండ.. మరోవైపు తీవ్ర ఉక్కపోతతో ఆపసోపాలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు, ముఖ్యంగా బాటసారుల ఇబ్బందులు తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం.. అందులో చల్లని నీటిని అందుబాటులో ఉంచడం ప్రభుత్వ కనీస బాధ్యత. కానీ, పిఠాపురం మున్సిపల్ అధికారులు చుక్క నీరు లేకుండానే చలివేంద్రాలు నిర్వహిస్తున్నట్టున్నారు. ఈ చిత్రాలు చూస్తే అలాగే అనిపించక మానదు. స్థానిక పాదగయ క్షేత్రం సెంటర్లో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రానికి ప్రతి రోజూ వేలాదిగా భక్తులు వస్తూనే ఉంటారు. వారు తమ దాహార్తిని తీర్చుకునేందుకు ఈ చలివేంద్రం వద్దకు వస్తే అక్కడ ఖాళీ వాటర్ క్యాన్లు దర్శనమిస్తూండటంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు. మున్సిపల్ అధికారులు మొక్కుబడిగా చలివేంద్రం ఏర్పాటు చేసి, అందులో నీరుందో లేదో కూడా పట్టించుకోకుండా చేతులు దులిపేసుకున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. – పిఠాపురం

● ఇదేందయ్యా ఇది.. ఇదెప్పుడూ చూడలే..