కూరగాయల సంచిలో మహిళ శవం

కోల్కతా : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోల్కతా, హరిదేవ్పూర్ ఏరియాకు చెందిన 60 ఏళ్ల సుజామణి గాయెన్ స్థానికంగా ఉన్న ఓ గుడి దగ్గర పూలమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. సుజామణికి, ఆమె కోడలు సుజాతకు మధ్య గత కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సుజాత, ఈమె తల్లి మలినా మండల్, మరో వ్యక్తి కలిసి సుజామణిని ప్రగతి మైదాన్లోని వారి ఇంటికి తీసుకెళ్లారు. (భూమి పూజ విషెస్: ‘అత్యాచారం చేసి చంపేస్తాం’)
అక్కడ తినే ఆహారంలో మత్తు మందు కలిపి స్పృహ తప్పేలా చేశారు. అనంతరం విచక్షణా రహితంగా కొట్టి, గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచెలో కుక్కి, పైన కూరగాయలు నింపారు. దాన్ని పడేయటానికి టాక్సీ డిక్కీలో ఉంచి తరలిస్తూ పోలీసులకు చిక్కారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి