వివాహిత అదృశ్యం.. ఏం జరిగిందో?

Married Woman Missing In Visakhapatnam - Sakshi

పరవాడ(విశాఖపట్నం): పెదముషిడివాడ శివారు గండివానిపాలెం గ్రామానికి చెందిన మడక దేవి (30) ఈ నెల 7 నుంచి కనిపించడం లేదని ఆమె భర్త రాము పరవాడ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. దేవి తల్లిదండ్రులు గండివానిపాలెంలో నివసిస్తున్నారు.

వారి ఇంటి నుంచి ఆమె ఈ నెల 7న సాయంత్రం 5 గంటలకు బయటకు వెళ్లిందని, అప్పటి నుంచి సమాచారం లేదని తెలిపారు. వారికి ఇద్దరు పిల్లలు. ఆమె ఆచూకీ తెలిసిన వారు పరవాడ సీఐ పి.ఈశ్వరరావుకు 9440796038 నంబర్‌లో సమాచారం అందజేయాలని స్టేషన్‌ హెచ్‌సీ శ్రీనివాసరావు కోరారు.
చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి.. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top