Man Commits Suicide In Warangal - Sakshi
Sakshi News home page

నీపై నాకు ప్రేమ ఉంది.. నాపై నీకు ప్రేమ ఉంటే చచ్చేముందైనా రావా!

Jun 1 2023 11:14 AM | Updated on Jun 1 2023 4:12 PM

man Commits Suicide In Warangal - Sakshi

వరంగల్: భార్యాకాపురానికి రాకపోవడంతోపాటు, అత్తింటివారు దూషించడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి.. తన భార్యను ఉద్దేశిస్తూ.. నీపైన నాకు ప్రేమ ఉంది.. నాపైన నీకు ప్రేమ ఉంటే చచ్చేముందన్న రావాలంటూ.. సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ధర్మారంతండా జీపీ శివారు వెంక్యాతండాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి.. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం జీపీ శివారు వెంక్యాతండాకు చెందిన బానోతు అశోక్‌(24), మహబూబాబాద్‌ మండలంలోని ముత్యాలమ్మతండాకు చెందిన బేబిని ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు.

ఈ క్రమంలో బేబి గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్లింది. నాలుగు నెలల క్రితం కొడుకు పుట్టాడు. కాగా అప్పటికే భార్యభర్తల మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈక్రమంలో భార్యను కాపురానికి తీసుకురావడం కోసం 5రోజుల క్రితం అశోక్‌ తన అత్తగారింటికి వెళ్లాడు. దీంతో భార్య బేబి, అత్త వాంకుడోతు సత్రి, మామ ఆనంద్, తోటి అల్లుడు నరేష్, వదిన రజిత కలిసి అశోక్‌ను దూషించడంతో ఇంటికి వచ్చిన అనంతరం మే 28న ఇంట్లో పురుగులమందు డబ్బాతో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

ఈక్రమంలో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. బుధవారం మానుకోట ఏరియా ఆస్పిత్రిలో మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశోక్‌ భార్య, అత్త, మామ, తోటి అల్లుడు, వదినలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement