జీవితం మీద విరక్తితోనే చనిపోతున్నా.. | Inter‌ Student Commits Suicide In Malkajgiri Hyderabad | Sakshi
Sakshi News home page

నా చావుకు తల్లితండ్రులు కారణం కాదు..

Dec 15 2020 8:38 AM | Updated on Dec 15 2020 8:38 AM

Inter‌ Student Commits Suicide In Malkajgiri Hyderabad - Sakshi

తనూష (ఫైల్‌ పొటో)

సాక్షి, మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.  ఎస్‌ఐ బి.శ్రీనివాస్‌ తెలిపిన మేరకు.. సర్దార్‌ పటేల్‌నగర్‌కు చెందిన ఎల్లేష్,చంద్రకళ భార్యాభర్తలు. వీరికి కుమారుడు పవన్‌కుమార్, కూతురు తనూష(17) ఉన్నారు. తనూష ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ప్రజ్ఞాపూర్‌లోని గురుకుల్‌ కాలేజీలో చదువుతోంది. లాక్‌డౌన్‌ సందర్భంగా ఇంటి వద్దనే ఉంటోంది. ఈ నెల 14న ఎల్లేష్‌ , చంద్రకళల, పవన్‌కుమార్‌లు పనిమీద బయటకు వెళ్లారు. చదవండి: (గుడికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..)

మధ్యాహ్నం ఇంటికి వచ్చిన చంద్రకళ బాత్‌రూమ్‌లో కాలిన గాయాలతో ఉన్న తనూషను గమనించింది. భర్తకు ఫోన్‌ ద్వారా తెలియజేసి 108 కు సమాచారం అందించింది. సంఘటనా స్ధలానికి వచ్చిన సిబ్బంది అప్పటికే తనూష మృతి చెందినట్లు తెలిపారు. తన చావుకు తల్లితండ్రులు కారణం కాదని, జీవితం మీద విరక్తితో కిరోసిన్‌ పోసుకొని చనిపోదామనుకుంటున్న అని రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు గుర్తించారు. చదవండి: (దారుణం: మైనర్‌పై అత్యాచారం చేసిన ఏఎస్సై)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement