భార్యతో గొడవ.. ఇంటికి నిప్పుపెట్టి.. ఆపై ఎంత పనిచేశాడంటే..

Husband Commits Suicide Due To Allegeing With Wife In Krishna District - Sakshi

అవనిగడ్డ(కృష్ణా జిల్లా): భార్యతో గొడవల కారణంగా భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికి నిప్పుపెట్టి, ఆపై ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన అవనిగడ్డ పంచాయతీ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్‌ అందించిన వివరాలు ప్రకారం..  స్థానిక లంకమ్మ మాన్యంలో నివశించే వెంకటేశ్వరరావు (35)కు భార్యతో తరచూ గొడవ జరగుతుండేది.

చదవండి: ఆరేళ్ల క్రితం వివాహం.. భార్యపై అనుమానంతో..

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి, భార్య, కుటుంబసభ్యులు ఇంటి బయట ఉండగా వెంకటేశ్వరరావు లోపల పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ బీరువాలో బట్టలు బయటకు తీసి నిప్పు పెట్టి, ఆ తర్వాత ఉరివేసుకున్నాడు. బయటకు మంటలు వ్యాపించడంతో భార్య కుటుంబసభ్యులు లోపలకు వచ్చి చూడగా అప్పటికే వెంకటేశ్వరరావు మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top