చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి.. చివరకు
Man Last Breath After Chicken Bone Stuck in Throat At Chennai
చెన్నై: అందియూరు సమీపంలో చికెన్ తింటున్న సమయంలో గొంతులో ఎముక ఇరుక్కుని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఈరోడ్ జిల్లా అందియూరు సమీపం కుచ్చి కల్లూరుకు చెందిన సుబ్రమణ్యన్ (56) తాపీ మేస్త్రి. శుక్రవారం మధ్యాహ్నం అదే ప్రాంతంలో ఉన్న స్నేహితుడు మునిరాజు ఇంటిలో కోడి మాంసం తిన్నాడు. ఆ సమయంలో ఓ చికెన్ ఎముక గొంతులో చిక్కుకుని ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతన్ని హుటాహుటిన అందియూరు ఆసుపత్రికి తరలించగా ఫలితం లేకపోయింది. అక్కడ పరిశోధించిన వైద్యులు సుబ్రమణ్యన్ అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
చదవండి: (త్వరలో పునీత్ సమాధి వద్దే పెళ్లి చేసుకొంటాం: గురురాజ్, గంగా)
మరిన్ని వార్తలు