గగుర్పాటు గొలిపే ఘోర ప్రమాదం | Car Hits Scooter Two Deceased At Choutuppal | Sakshi
Sakshi News home page

సిగ్నల్స్‌ వద్ద బీభత్సం సృష్టించిన కారు

Oct 12 2020 1:44 PM | Updated on Oct 12 2020 2:58 PM

Car Hits Scooter Two Deceased At Choutuppal - Sakshi

గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరూ చెరువుగట్టు వద్ద వివాహం చేసుకునేందుకు వెళ్తుండగా ప్రమాదానికి గురై అనూహ్యంగా ప్రాణాలు విడిచారు.

సాక్షి, భువనగిరి‌: హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ సమీపంలో సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి వరుసగా రెండు బైకులు, రెండు కార్లని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా... ఓ స్కూటీ పూర్తిగా దగ్దమయ్యి౦ది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. అందులో నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కారు బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్ది సేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ప్రేమ పెళ్లికని వెళ్తుండగా..
మృతుడు నాగరాజు  హయత్‌నగర్‌ చెందిన వాడిగా తెలిసింది. శ్రీలత అనే యువతితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నాగరాజు.. ఆమెను ప్రేమ పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యారు. ఈక్రమంలో ప్రేమికులిద్దరు చెరువుగట్టు వద్ద వివాహం చేసుకునేందుకు వెళ్తుండగా ప్రమాదానికి గురై అనూహ్యంగా ప్రాణాలు విడిచారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుదామనుకున్న శ్రీలత, నాగరాజు అకాల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. 
(చదవండి: అనుమానం: భార్యతోపాటు మరో మహిళ దారుణ హత్య)

Advertisement
 
Advertisement
Advertisement