చెల్లెలు చెప్పిన మాట వినటం లేదని..

న్యూఢిల్లీ : ఎంత చెప్పినా వినకుండా స్నేహితుడితో వాట్సాప్లో చాటింగ్లు, ఫోన్లో మాట్లాడుతోందన్న కోపంతో చెల్లెల్ని తుపాకితో కాల్చేశాడు ఓ అన్నయ్య. ఈ సంఘటన ఢిల్లీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని వెల్కమ్ ప్రాంతానికి చెందిన ఓ కుర్రాడు ఓపెన్ స్కూల్లో చదువుకుంటూ, సెలూన్లో పని చేస్తున్నాడు. అతడి చెల్లెలు చదువు మానేసి ఇంటి వద్దే ఉంటోంది. సోదరి తరచుగా ఓ స్నేహితుడితో చాటింగ్ చేయటం, ఫోన్లో మాట్లాడటం అతడికి నచ్చలేదు. స్నేహితుడితో చాటింగ్లు, టాకింగ్లు మానేయాలని చాలా సార్లు చెప్పాడు. ( కాళరాత్రి నరకం: సజీవంగా పాతిపెట్టి..)
అయితే ఆమె వినలేదు. గురువారం ఉదయం ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన అతడు తుపాకితో చెల్లెలిపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి