
కేసులతో మీడియాను భయపెట్టలేరు
మీడియా స్వేచ్ఛకు సంకెళ్లా..!
వార్తల్లో ఏవైనా అభ్యంతరం ఉంటే సరైన ఖండన ఇచ్చే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అలా కాకుండా కేసులు పెట్టి మీడియాను భయపెట్టాలని చూడడం సరైనది కాదు. ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే. సాక్షి ఎడిటర్పై పోలీసులు వ్యవహరించిన తీరు సరైనది కాదు. పోలీసుల ద్వారా మీడియాను భయపెట్టాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచిది కాదు. మీడియా పైన కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలి.
– కె. గిరిబాబు, రాష్ట ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్
మీడియాకు సంకెళ్లు వేయడం అంటే ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేసినట్లే. పత్రికల్లో ప్రచురించే కథనాలపై కేసులు పెట్టడం అన్యాయం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. పోలీసులను ముందు పెట్టి మీడియాను తన అదుపులోకి ఉంచుకోవాలని ప్రభుత్వం చూడడం సిగ్గుచేటు. పోలీసు కేసులతో మీడియాను కట్టడి చేయాలన్న ఆలోచన సరైంది కాదు. ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలి.
– పి. బాలచంద్ర, జనరల్ సెక్రటరీ, తిరుపతి ప్రెస్ క్లబ్

కేసులతో మీడియాను భయపెట్టలేరు