
స్పష్టత ఇవ్వాలి
మెగా డీఎస్సీ అభ్యర్థుల తుది జాబితా ఈనెల 15న ప్రచురించారు. ఆ తర్వాత నష్టపోయిన అభ్యర్థులు న్యాయం కోసం పరుగులు పెడు తున్నారు. కాల్లెటర్లు పంపించి, సర్టిఫికెట్లు పరిశీలించి ఉద్యోగం వస్తుందన్న అధికారులే నేడు ఉద్యోగం రాలేదని పేర్కొనడం బాధిస్తోంది. జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన డీఎస్సీ ప్రక్రి య రాష్ట్ర స్థాయిలో నిర్వహించడంలో దాగి ఉన్న రహస్యమేమిటో తెలియని దుస్థితి. తుది జాబితా అనంతరం హెల్ప్డెస్క్కు ఫిర్యాదు చేసి న్యాయం కోసం వస్తున్న అభ్యర్థులకు స్పష్టత ఇవ్వాలి.
– రెడ్డిశేఖర్రెడ్డి,
వైఎస్ఆర్టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్