
పత్రికా విలేకరులపై కేసులా?
ఎవరిపైనన్నా కావాలనే తప్పుడు న్యూస్ రాస్తే కూడా దానికి రీజాయిండర్ ఇస్తారు. కానీ ప్రెస్మీట్లో మాట్లాడిన న్యూస్ను రాస్తే దానిపై విలేకరులు, ఆ పత్రిక ఎడిటర్పై కేసులు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా..? ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పిలవబడే పత్రికలకు అసలు మన రాష్ట్రంలో స్వేచ్ఛ ఉందా...? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోందనే అక్కసుతో ఓ పత్రికపై మాత్రమే కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా కేసులు పెట్టిస్తోందనే విషయం సాధారణ ప్రజలకు సైతం అర్థమవుతోంది. పత్రికలపై కన్నెర్ర చేసిన ఎన్నో ప్రభుత్వాలు గతంలో కాలగర్భంలో కలిచిపోయాయి. ఈ విషయాన్ని ఇప్పటికై నా సీఎం చంద్రబాబు ఆలోచనచేస్తే బాగుంటుంది.
– వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే, పలమనేరు