చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడిగా చవ్వా రాజశేఖర్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడిగా చవ్వా రాజశేఖర్‌రెడ్డి

Apr 30 2025 12:22 AM | Updated on Apr 30 2025 12:22 AM

చిత్త

చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడిగా చవ్వా రాజశ

తిరుపతి సిటీ: వైఎస్సా ర్‌ సీపీ అధ్యక్షుడు వై ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూ రు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడిగా చ వ్వా రాజశేఖర్‌ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కా ర్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా, అనంతపురం పట్టణానికి చెందిన ఆయన ఎంఏ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తితో దివంగత వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడిచారు. అనంత రం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌ సీపీ బలోపేతానికి కృషి చేశారు. పార్టీకి విధేయుడిగా అంకితభావంతో పనిచేసిన ఆయ న సేవలను గుర్తించిన పార్టీ ఆయన్ని చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ ప రిశీలకుడిగా పార్టీ నియమించింది. ఆయన మా ట్లాడుతూ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. పదవిని అప్పగించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటానన్నారు.

వైఎస్సార్‌ సీపీ తిరుపతి పార్లమెంట్‌ పరిశీలకుడిగా ఎంపీ మేడా రఘునాథరెడ్డి

తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడిగా రాజ్యసభ స భ్యులు మేడా రఘునా థరెడ్డి నియమితులయ్యారు. వైఎస్సార్‌ క డప జిల్లా నందలూ రు మండలం, చెన్నయ్యగారిపల్లెకు చెందిన ఆ యన పారిశ్రామిక వేత్తగా, సీనియర్‌ రాజకీనాయకుడిగా గుర్తింపు పొందారు. 2024లో ఆ య న్ని పార్టీ రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేసింది.

చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడిగా చవ్వా రాజశ1
1/1

చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడిగా చవ్వా రాజశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement