
సుగుటూరు.. జన హోరు
అమ్మవారి ఊరేగింపులో భక్తజన సందోహం.. (ఇన్సెట్లో) అమ్మవారు
పుంగనూరులోని శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. జమీందారుల కులదైవమైన గంగమ్మకు ప్యాలెస్లో పూజలు చేసి అట్టహాసంగా మంగళవారం వేడుకలు ప్రారంభించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ కలసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతర సందర్భంగా అమ్మవారిని పల్లకీలో పట్టణ పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. జాతరకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పుర వీధులు కిక్కిరిశాయి. అమ్మవారికి నెయ్యి దీపాలు, పెరుగన్నం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. – పుంగనూరు

సుగుటూరు.. జన హోరు

సుగుటూరు.. జన హోరు

సుగుటూరు.. జన హోరు