వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతర చివరి ఘట్టం గురువారం అట్టహాసంగా ముగిసింది. సాయంత్రం జరిగిన అమ్మవారి నగరోత్సవం జనసముద్రాన్ని తలపించింది. ‘జై పోలేరమ్మా.. జైజై పోలేరమ్మా..’ అంటూ భక్తుల నామస్మరణ వెంకటగిరి పురవీధుల్లో మార్మోగింది. గతానికి భిన్నంగా ఈ సారి రాష్ట్ర పండుగ హోదాలో
సంప్రదాయానికి పెద్దపీట వేశారు.వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి నేతృత్వంలో వెంకటగిరి రాజాల సూచనలు, సలహాలతో జాతరను విజయవంతంగా పూర్తిచేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు.


