ఢిల్లీలో వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా సదస్సు | World Food India 2025 is set to take place in New Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా సదస్సు

Jul 24 2025 10:44 AM | Updated on Jul 24 2025 11:29 AM

World Food India 2025 is set to take place in New Delhi

సెప్టెంబర్‌ 25 నుంచి 28 వరకు నిర్వహణ 

‘వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా 2025’ సదస్సు సెప్టెంబర్‌ 25 నుంచి 28 వరకు ఢిల్లీలో జరగనుంది. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ ప్రకటించారు. ఈ రంగంలో పెట్టుబడుల అవకాశాలను అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు పరిచయడం చేయడం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సదస్సును ‘భారత్‌ మండపం’లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక పోర్టల్, మొబైల్‌ అప్లికేషన్‌ను మంత్రి ఆవిష్కరించారు.

ఇదీ చదవండి: డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ.1,410 కోట్లు

గతంలో నిర్వహించిన మూడు ఎడిషన్లు (సదస్సులు) విజయవంతమైనట్టు, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్టు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ కార్యదర్శి అవినాష్‌ జోషి తెలిపారు. గత దశాబ్ద కాలంలో ఈ రంగం ఎంతో పురోగతి సాధించినట్టు చెప్పారు. దేశ వ్యవసాయ ఎగుమతుల్లో ఈ విభాగం నుంచే 20 శాతం ఉంటున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎక్విప్‌మెంట్‌ తయారీదారులు, ప్యాకేజింగ్‌ సొల్యూషన్‌ కంపెనీలు, లాజిస్టిక్స్‌ సంస్థలు, స్టార్టప్‌లు పాల్గొనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement