
రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు ఆదివారం (సెప్టెంబర్ 15) సెలవు తీసుకున్నట్లు.. స్థిరంగా ఉండిపోయాయి. ధరల్లో ఏ మాత్రం చలనం లేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి. ఈ కథనంలో దేశంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68650 వద్ద, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 74890 వద్ద ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు కాబట్టి నిన్నటి అదే ధరలు ఈ రోజు కూడా కొనసాగుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే.. చెన్నైలో కూడా గోల్డ్ రేటు స్థిరంగానే ఉంది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68650 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 74890గా ఉంది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ బంగారం ధర రూ. 68800 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.75040 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న వరుసగా రూ. 400, రూ. 440 పెరిగిన పసిడి ఈ రోజు స్థిరంగానే ఉంది.
ఇదీ చదవండి: ఐఫోన్ 16 సిరీస్ ఫ్రీ-బుకింగ్స్: ఇలా బుక్ చేసుకోండి
వెండి ధరలు
దేశంలో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 97,000 వద్ద ఉంది. ఇటీవల కాలంలో సిల్వర్ రేటు భారీగా పెరిగింది. ఇదే ధరలు దాదాపు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ కొనసాగుతాయి. ధరలు ఇలాగే కొనసాగితే.. కేజీ సిల్వర్ రేటు లక్ష రూపాయలకు చేరుకోవడానికి మరెన్నో రోజులు పట్టే అవకాశం లేదు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).