
కృత్రిమ మేధకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. దాంతో ఆన్లైన్ మెసేజింగ్ యాప్లు ఏఐను తమ ప్లాట్ఫామ్ల్లో భాగం చేస్తున్నాయి. అందులో భాగంగా టెలిగ్రామ్ ఎక్స్ఏఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు తెలిపింది. ఈమేరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఎక్స్ఏఐ గ్రోక్ చాట్బాట్ను వాడేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ 300 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. దాంతోపాటు టెలిగ్రామ్ ద్వారా విక్రయించిన ఎక్స్ఏఐ సబ్స్క్రిప్షన్ల నుంచి ఇరు కంపెనీలకు 50 శాతం ఆదాయ భాగస్వామ్యం ఉన్నట్లు పేర్కొన్నాయి.
టెలిగ్రామ్కు ఉన్న యూజర్ బేస్ గ్రోక్ విస్తరణకు కూడా ఎంతో తోడ్పడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సంభాషణాత్మక ఏఐ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందిన ఈ చాట్బాట్ను టెలిగ్రామ్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ తన ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు ప్రకటించినా, ఎక్స్ఏఐ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.
🔥 This summer, Telegram users will gain access to the best AI technology on the market. @elonmusk and I have agreed to a 1-year partnership to bring xAI’s @grok to our billion+ users and integrate it across all Telegram apps 🤝
💪 This also strengthens Telegram’s financial… pic.twitter.com/ZPK550AyRV— Pavel Durov (@durov) May 28, 2025
ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామం
మార్కెట్లో ఇప్పటికే వాట్సప్, గూగుల్చాట్ వంటి మేసేజింగ్ యాప్ల్లో మెటా లామా, జెమిని వంటి ఏఐ టూల్స్ సేవలందిస్తున్నాయి. ఈ కంపెనీలకు మాతృసంస్థలుగా ఉన్న మెటా, గూగుల్ సొంతంగా తయారు చేసిన ఈ ఏఐ టూల్స్ను వాడుతున్నాయి. అయితే టెలిగ్రామ్కు ఆ అవకాశం లేదు. దాంతో తన ప్లాట్ఫామ్లో ఏఐ టూల్ వాడేందుకు ఎక్స్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుందనే వాదనలున్నాయి.