మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 382.50 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో 74,649.84 వద్ద, నిఫ్టీ 100.95 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 23,483.55 వద్ద నిలిచాయి.
థాకర్ & కంపెనీ లిమిటెడ్, జీనా సిఖో లైఫ్కేర్ లిమిటెడ్, జీ-టెక్ జైంక్స్ ఎడ్యుకేషన్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, బాలాజీ అమైన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సుప్రియా లైఫ్సైన్స్ లిమిటెడ్, పయనీర్ ఇన్వెస్ట్కార్ప్ లిమిటెడ్, వోక్హార్డ్ లిమిటెడ్, మ్యానుగ్రాఫ్ ఇండియా లిమిటెడ్, బి&బి ట్రిపుల్వాల్ కంటైనర్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


