వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్..! | Sensex losses 59 points in a quiet session, Nifty below 17300 points on Feb 18th | Sakshi
Sakshi News home page

వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్..!

Feb 18 2022 4:06 PM | Updated on Feb 18 2022 4:06 PM

Sensex losses 59 points in a quiet session, Nifty below 17300 points on Feb 18th - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు అనంతరం పుంజుకొని లాభాల్లోకి మళ్లింది. 250 పాయింట్లకుపైగా పెరిగి 58 వేల 175 వద్ద గరిష్ఠం నమోదుచేసింది. గత సెషన్ల మాదిరిగానే ఆఖరి గంటలో మళ్లీ భారీ కుదుపునకు లోనైంది. రష్యా- ఉక్రెయిన్​ ఉద్రిక్త పరిస్థితులు.. ఫార్మా, రియాల్టీ, ఆయిల్ & గ్యాస్ స్టాక్స్ భారీగా పడిపోవడం చేత మూడో సెషన్​లో మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి.

ముగింపులో, సెన్సెక్స్ 59.04 పాయింట్లు(0.10%) క్షీణించి 57,832.97 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 28.30 పాయింట్లు (0.16%) నష్టపోయి 17,276.30 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.66 వద్ద ఉంది. నిఫ్టీలో కోల్​ ఇండియా, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, బజాజ్​ ఆటో, హెచ్​డీఎఫ్​సీ, గ్రేసిమ్, లార్సెన్ & టౌబ్రో రాణిస్తే.. సిప్లా, ఓఎన్​జీసీ, దివీస్​ ల్యాబ్స్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, శ్రీ సిమెంట్స్​ డీలాపడ్డాయి. శుక్రవారం సెషన్​లో బ్యాంకింగ్​ రంగం షేర్లు మాత్రం స్వల్పంగా లాభపడితే.. ఫార్మా, రియాల్టీ, ఆయిల్​ &​ గ్యాస్​ షేర్లు 1 శాతం పతనమయ్యాయి. బీఎస్​ఈ మిడ్​, స్మాల్​క్యాప్​ సూచీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి.

(చదవండి: ప్రముఖ కంపెనీతో మారుతీ సుజుకీ కీలక ఒప్పందం..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement