లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..! | Nifty Ends Above 17200 Sensex Gains 231 pts Led By Auto, Bank, oil and gas | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..!

Mar 28 2022 4:07 PM | Updated on Mar 28 2022 4:11 PM

Nifty Ends Above 17200 Sensex Gains 231 pts Led By Auto, Bank, oil and gas - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత తిరిగి పుంజుకోవడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. ఆటో, బ్యాంక్, ఆయిల్ & గ్యాస్, మెటల్ స్టాక్స్ మద్దతుతో భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు ఈ రోజు లాభాలలో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 231.29 పాయింట్లు(0.40 శాతం) పెరిగి 57,593.49 వద్ద ఉంటే, నిఫ్టీ 69 పాయింట్లు(0.40 శాతం) పెరిగి 17222 వద్ద ముగిశాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.16 వద్ద ఉంది. 

నిఫ్టీలో భారతీ ఎయిర్‌టెల్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రాణిస్తే.. యూపీఎల్, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, హెచ్​డీఎఫ్​సీ నష్టపోయాయి.బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక్కో శాతం చొప్పున లాభపడగా.. ఆటో, మెటల్ సూచీలు 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే, క్యాపిటల్ గూడ్స్, ఐటీ & ఫార్మా పేర్లలో అమ్మకాలు కనిపించాయి. బీఎస్ఈ మిడ్‍క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు నష్టాలలో ముగిశాయి.

ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి తమిళనాడుతో కంపెనీ ఒక అవగాహన ఒప్పందం(ఎమ్ఒయు) పై సంతకం చేసిన తరువాత ఆస్టర్‌ డిఎం హెల్త్‌కేర్‌ షేరు ధర 10 శాతం పెరిగింది. మల్టీప్లెక్స్‌ బ్రాండ్స్‌ పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్‌ లిమిటెడ్‌ సంస్థల విలీనంతో వాటి షేర్ల ధరలు 52 వారాల గరిష్టాలను తాకాయి. కంపెనీ పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి మార్చి 31న కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం జరగనుండటంతో గెయిల్ ఇండియా షేరు ధర 3 శాతం పెరిగింది.

(చదవండి: జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌..! ఎన్నడూ లేని విధంగా యూజర్లకు బెనిఫిట్స్‌..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement