భారత్‌లో రూ.4.12 కోట్ల మసెరటి కారు లాంచ్ | Maserati MC Pura Launched in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో రూ.4.12 కోట్ల మసెరటి కారు లాంచ్

Oct 4 2025 9:25 PM | Updated on Oct 4 2025 9:26 PM

Maserati MC Pura Launched in India

మసెరటి ఇండియా.. ఎంసీపూరా, ఎంసీపూరా సిలో కన్వర్టిబుల్‌ కార్లను లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ.4.12 కోట్లు, రూ.5.12 కోట్ల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. 2025 జులైలో గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో కనిపించిన ఈ కార్లు ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసిన 3 నెలల తర్వాత భారతదేశంలో లాంచ్ అయ్యాయి.

లేటెస్ట్ డిజైన్ కలిగిన ఈ కారు.. గ్రిల్, సీ పిల్లర్‌పై ట్రైడెంట్ లోగోలను పొందుతుంది. స్క్రిప్ట్, వీల్ సెంటర్ క్యాప్‌లపై కూడా ఎంసీపూరా బ్యాడ్జ్‌లు చూడవచ్చు. బటర్‌ఫ్లై వింగ్ డోర్లు, కార్బన్ ఫైబర్ మోనోకోక్ ఛాసిస్, కన్వర్టిబుల్ వెర్షన్ కోసం రిట్రాక్టబుల్ గ్లాస్ రూఫ్ వంటివి ఈ కారులో చూడవచ్చు.

ఇంజిన్ విషయానికి వస్తే.. మసెరటి ఎంసీ పూరా 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వీ6 ఇంజిన్ పొందుతుంది. ఇది 621 హార్స్ పవర్, 719 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఈ కారు కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 325 కిమీ/గం.

Advertisement
 
Advertisement
Advertisement