ఆక్సిజన్ కోసం ప్లాంట్ మూసేసిన మారుతి సుజుకి | Maruti Suzuki Shut Down Plants To Make Oxygen For Medical Needs | Sakshi
Sakshi News home page

ఆక్సిజన్ కోసం ప్లాంట్ మూసేసిన మారుతి సుజుకి

Apr 28 2021 5:55 PM | Updated on Apr 28 2021 8:12 PM

Maruti Suzuki Shut Down Plants To Make Oxygen For Medical Needs - Sakshi

హర్యానా: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి హర్యానాలో ఉన్న తన తయారీ యూనిట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌2లో తెలిపింది. అలాగే, గుజరాత్‌లో కూడా తన తయారీ విభాగాన్ని మూసివేయాలని సుజుకి మోటార్ నిర్ణయించినట్లు మారుతి సుజుకి తెలిపింది. మే 1 నుంచి మే 9 వరకు కంపెనీ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. "కార్ల తయారీలో భాగంగా, మారుతి సుజుకి తన కర్మాగారాల్లో ఆక్సిజన్‌ను ఉపయోగిస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఆక్సిజన్‌ కోసం వాడుకోవాలని మేము నమ్ముతున్నాము" అని మారుతి సుజుకి ఒక ప్రకటనలో పేర్కొంది. 

గుజరాత్ సుజుకి మోటార్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీకి సమాచారం అందిందని మారుతి సుజుకి తెలిపారు. మారుతి సుజుకి వైద్య అవసరాలకు ఆక్సిజన్ తయారు చేయడానికి ప్లాంట్లను మూసివేస్తుంది. గత 24 గంటల్లో 3,293 మంది మరణించడంతో భారతదేశం కోవిడ్ మరణాల సంఖ్య శిఖర స్థాయికి చేరుకున్నాయి. ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత మారుతి సుజుకి షేర్లు 0.44 శాతం పెరిగి 6,587 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి, సెన్సెక్స్ 1.6 శాతం పెరిగింది. దేశంలో ఒక్కరోజులోనే దాదాపు 3 వేల 300 మంది కరోనాతో చనిపోయారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒక్కరోజులో 3 వేల కరోనా మరణాలు ఎప్పుడూ నమోదుకాలేదు. 24 గంటల్లో 3 లక్షల 62 వేల కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

చదవండి: 

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కుటుంబాల పొదుపు.. ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement