న్యూఢిల్లీ: ముడిసరుకు వ్యయం పెరగడంతో వాహనాల ధరలను పెంచుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ప్రకటించింది. ఈ జూలై 10 (రేపటి) నుంచి ఎస్యూవీ వాహనాల ధరలను సగటున 2.7 శాతం, వాణిజ్య వాహనాల ధరలను సగటున 2 శాతం పెంచనున్నట్లు తెలిపింది.
అయితే ధరల పెంపు మోడల్ను బట్టి మారుతుందని పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న స్కార్పియో, థార్, ఎక్స్యూవీ 3ఎక్స్వో, ఎక్స్యూవీ 7ఎక్స్వో ఎస్యూవీల ధరలు రూ.7.54 లక్షల నుంచి రూ.25.07 లక్షల మధ్య ఉన్నాయి.


