రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం.. | IOC to Invest Rs 1 66 Lakh Crore Over Five Years | Sakshi
Sakshi News home page

రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం..

Aug 31 2025 12:55 PM | Updated on Aug 31 2025 1:19 PM

IOC to Invest Rs 1 66 Lakh Crore Over Five Years

వ్యాపార ప్రణాళికల్లో భాగంగా వచ్చే అయిదేళ్లలో రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) చైర్మన్‌ అర్విందర్‌ సింగ్‌ సాహ్నీ తెలిపారు. చమురు శుద్ధి, ఇంధన మార్కెటింగ్‌ విస్తరణతో పాటు పెట్రో కెమికల్స్, రెన్యూవల్‌ ఎనర్జీ వ్యాపారాలు చేపట్టేందుకు ఈ పెట్టుబడులు వినియోగిస్తామన్నారు.

ప్రస్తుతం కంపెనీ రిఫైనింగ్‌ వార్షిక సామర్థ్యం 80.75 మిలియన్‌ టన్నులుగా ఉందని షేర్‌హోల్డర్ల సమావేశంలో ఆయన చెప్పారు. అర్విందర్‌ సింగ్‌ సాహ్నీ మాట్లాడుతూ, ‘‘పెట్టుబడుల ద్వారా మేము దేశీయ ఇంధన అవసరాలను స్వయం సమృద్ధిగా తీర్చే దిశగా అడుగులు వేస్తున్నాం. పెట్రో కెమికల్స్‌ విభాగంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు.

అలాగే, రెన్యూవబుల్‌ ఎనర్జీ రంగంలో ఐఓసీ కీలక ప్రాజెక్టులను ప్రారంభించనుందని చెప్పారు. గ్రీన్‌ హైడ్రోజన్‌, సోలార్‌ పవర్‌, బయోఎనర్జీ వంటి పునరుత్పాదక శక్తి వనరులపై దృష్టి సారించి, కార్బన్‌ ఉద్గారాలను తగ్గించేందుకు సంస్థ కట్టుబడి ఉందని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement