
ఏటీఎం గురించి తెలుసా? అని ఎవరినైనా అడిగితే.. అదెందుకు తెలియదు మాకు తెలుసు అనే చాలామంది చెబుతారు. అయితే గోల్డ్ ఏటీఎం గురించి తెలుసా? అని అడిగితే.. అడిగిన వాళ్లనే అనుమానంగా చూస్తారు. బహుశా మీ అనుమానం కరెక్టే కావచ్చు, కానీ అలాంటి ఏటీఎం కూడా ఒకటి వచ్చేసింది. దాని గురించి తెలుసుకోవాలంటే, ఈ కథనం చదివేయాల్సిందే..
చైనాలోని షాంఘైలో బంగారాన్ని కరిగించి, దానికి తగిన డబ్బును అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసే ఏటీఎం మెషిన్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో గోల్డ్ వేస్తే.. దాని బరువును, నాణ్యతను బట్టి.. ఆ రోజు మార్కెట్ విలువను బట్టి వినియోగదారుడి బ్యాంక్ ఖాతాకు డబ్బును జమ చేస్తుంది. ఇదంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఈ మెషిన్ బంగారాన్ని 1,200 డిగ్రీల సెల్సియస్ వద్ద కరిగిస్తుంది తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం.. మారిన ఏటీఎం ఛార్జీలు
వీడియోలో గమనించినట్లయితే.. ఒక మహిళ బంగారాన్ని ఏటీఎం మెషిన్లో వేసిన తరువాత, ఆ రోజు ధరలను లెక్కగట్టి, బంగారంకు విలువకు తగిన డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదే ప్రపంచంలోని మొట్ట మొదటి గోల్డ్ ఏటీఎం మెషిన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. టెక్నాలజీకి ఫిదా అయిపోతున్నారు.
This gold ATM in China melts your gold and transfers the money to your bank accountpic.twitter.com/vCmS09eRYG
— Learn Something (@cooltechtipz) April 20, 2025