
గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ ఉన్న పసిడి ధరలు మళ్ళీ పెరుగుదలవైపు అడుగులువేశాయి. దీంతో నేడు (జులై 12) మళ్ళీ బంగారం ధరలు గరిష్టంగా రూ. 440 పెరిగింది. దీంతో మళ్ళీ ఒక్కసారిగా గోల్డ్ రేట్లు పైకి లేశాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
విజయవాడ, హైదరాబాద్లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో కూడా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67600 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73750 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగింది. కాబట్టి ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67750 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73900 వద్ద ఉంది.
హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో మాత్రమే కాకుండా చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68250.. కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 74460 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు వరుసగా రూ. 400, రూ. 440 పెరిగినట్లు స్పష్టమవుతోంది.
వెండి ధరలు
బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరల్లో మాత్రం ఎటువంటి చలనం లేదని తెలుస్తోంది. అంటే ఈ రోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు (జులై 12) ఒక కేజీ వెండి రూ. 95500 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగినట్లు తెలుస్తోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).