బీహెచ్‌ఈఎల్‌ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి | BHEL board approves induction of Koppu Sadashiv Murthy as CMD | Sakshi
Sakshi News home page

బీహెచ్‌ఈఎల్‌ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి

Oct 31 2023 6:00 AM | Updated on Oct 31 2023 6:00 AM

BHEL board approves induction of Koppu Sadashiv Murthy as CMD - Sakshi

న్యూఢిల్లీ: బీహెచ్‌ఈఎల్‌ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బీహెచ్‌ఈఎల్‌ బోర్డు ఆమోదం తెలిపింది. మూర్తిని సీఎండీగా నియమించే ప్రతిపాదనకు అపాయింట్‌మెంట్‌ కమిటీ ఆఫ్‌ కేబినెట్‌ (ఏసీసీ) ఆమోదం తెలిపిన విషయమై భారీ పరిశ్రమల శాఖ నుంచి బీహెచ్‌ఈఎల్‌కు సమాచారం అందింది. దీంతో సోమవారం సమావేశమైన బీహెచ్‌ఈఎల్‌ బోర్డు ఇందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం సదాశివ మూర్తి కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ‘‘సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి నియామకం నవంబర్‌ 1 తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు అమల్లోకి వస్తుంది. పదవీ విమరణ తేదీ 2027 ఫిబ్రవరి 28 వరకు లేదంటే, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు (ఏది ముందు అయితే అది) ఈ నియామకం అమల్లో ఉంటుంది’’అని బీహెచ్‌ఈఎల్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement