చర్ల మండలంలో రాళ్లగూడెం నుంచి సుబ్బంపేట వరకు ప్రధాన రహదారి వెంట కొన్నేళ్లుగా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
భద్రాచలం – వెంకటాపురం రాష్ట్రీయ రహదారి–12పై దేవరాపల్లి, కుదునూరు,
ఆర్.కొత్తగూడెం, సత్యనారాయణపురం, సి కత్తిగూడెం, కొయ్యూరు, సుబ్బంపేట తదితర గ్రామాల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు వృక్షాలుగా మారి
కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం వేసవి తీవ్రత నేపథ్యాన ఈ మార్గంలో వెళ్తున్న వాహనదారులు కాసేపు ఆగి సేదదీరుతున్నారు. – చర్ల


