● ప్రశ్నించేవారినే ఎన్నుకోవాలి | - | Sakshi
Sakshi News home page

● ప్రశ్నించేవారినే ఎన్నుకోవాలి

Dec 14 2025 8:33 AM | Updated on Dec 14 2025 8:33 AM

● ప్రశ్నించేవారినే ఎన్నుకోవాలి

● ప్రశ్నించేవారినే ఎన్నుకోవాలి

● ప్రశ్నించేవారినే ఎన్నుకోవాలి

గుండాల: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏజెన్సీలో అభివృద్ధి కావాలంటే ప్రశ్నించే, పోరాడేవారినే ఎన్నుకోవాలని, అందుకే మాస్‌లైన్‌(ప్రజాపంథా) అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అజ్ఞాతంలో బాటన్న, కోటన్న, లింగన్న బాటలో సమస్యలపై పోరాడిన వ్యక్తి ఈసం శంకరన్న సర్పంచ్‌ అభ్యర్థిగా ఉన్నాడని, ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపంచాలని కోరారు. అధికారులు అధికారపార్టీకే మద్దతుగా నిలిచినట్లుగా తెలుస్తోందని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చండ్ర అరుణ, అభ్యర్థి ఈసం శంకర్‌, మాచర్ల సత్యం, సుగుణారావు, క్రిష్ణ, శాంతయ్య, జగన్‌, సాంబయ్య, ఆజాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement