పాఠశాల ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పాఠశాల ప్రారంభం

Sep 18 2025 7:10 AM | Updated on Sep 18 2025 7:10 AM

పాఠశాల ప్రారంభం

పాఠశాల ప్రారంభం

అన్నపురెడ్డిపల్లి, (చండ్రుగొండ): మండలంలోని కనకగిరి గుట్టల ప్రాంతంలో ఉన్న రజబ్‌అలీ నగర్‌లో గిరిపుత్రుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలను బుధవారం ఎంఈఓ ఉండేటి అనంద్‌కుమార్‌ ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల రజబ్‌అలీనగర్‌ 3 కి.మీ. దూరంలో ఉంది. గొత్తికోయ చిన్నారులు పాఠశా లకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న ఎంఈఓ ఆనంద్‌కుమార్‌ సమస్యను ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ ప్రారంభించారు. కార్యక్రమంలో సీసీఓ వెంకటరమణ, సీఆర్‌పీలు శిరీష, కృష్ణ, బుచ్చయ్య, వి.వెంకటేశ్వరరావు, జయరాం, శంకర్‌, మహదేవన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement