
సింగరేణిలో 21 మంది అధికారుల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 21 మంది ఫైనాన్స్ అధికారులను బదిలీ చేస్తూ కార్పొరేట్ ఈఈ సెల్ హెచ్వోడీ ఏజే మురళీధర్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీఅయిన వారిలో డీజీఎం, ఫైనాన్స్ మేనేజర్, ఇద్దరు డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్లు, 8 మంది సీనియర్ అకౌంట్ ఆఫీసర్లు, నలుగురు మేనేజ్మెంట్ ట్రైనీలు, ఐదుగురు జూనియర్ అకౌంట్ ఆఫీసర్లు ఉన్నారు. వీరందరూ ఈ నెల 12వ తేదీలోగా కేటాయించిన ఏరియాల్లో బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.