డంపింగ్‌యార్డులో గిరిజనుల నిరసన | - | Sakshi
Sakshi News home page

డంపింగ్‌యార్డులో గిరిజనుల నిరసన

Jul 5 2025 6:20 AM | Updated on Jul 5 2025 6:20 AM

డంపింగ్‌యార్డులో గిరిజనుల నిరసన

డంపింగ్‌యార్డులో గిరిజనుల నిరసన

అశ్వారావుపేటరూరల్‌: తమ పట్టా భూములను జాయింట్‌ సర్వే చేసి అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ గిరిజనులు వినూత్నంగా ఓ డంపింగ్‌యార్డు లో నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని రామన్నగూడేనికి చెందిన 150 మంది గిరిజనులకు సర్వే నంబర్లు 30,36, 39లో 573 ఎకరాలకు సంబంధించి తమ పూర్వీకుల నుంచి పట్టాలు కలిగి ఉన్నారు. కాగా, ఈ భూములు కొన్నేళ్లుగా అటవీ, ఎఫ్‌డీసీ ఆధీనంలో ఉండగా ఆయా భూముల్లో టేకు, వెదు రు ప్లాంటేషన్లు ఉన్నాయి. ఈ భూములను నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌తోపాటు హైకోర్టు పూర్వ పట్టాలు ఉన్న గిరిజనులకు సర్వే చేసి అప్పగించా లని 13 ఏళ్ల కిందటే ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, ఈ భూములను జాయింట్‌ సర్వే చేసేందుకు రెవెన్యూ, ఫారెస్టు, ఎఫ్‌డీసీ అధికారులు ముందుకు రాకపోవడంతో ఏళ్లుగా గిరిజనులు తమ భూము లు అప్పగించాలని దశలవారీగా పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా రామన్నగూడెం పంచాయతీ డంపింగ్‌ యార్డులో బాధిత గిరిజనులు తమ వద్ద ఉన్న పూర్వ పట్టాలను చేతుల్లో పట్టుకొని గంటపాటు నిరసన వ్యక్తం చేసి, జాయింట్‌ సర్వే చేయాలని డిమాండ్‌ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement