కమనీయంగా రామయ్య నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయంగా రామయ్య నిత్యకల్యాణం

Apr 24 2025 12:41 AM | Updated on Apr 24 2025 12:41 AM

కమనీయ

కమనీయంగా రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

బాధ్యతలు

స్వీకరించిన జడ్జీలు

కొత్తగూడెంటౌన్‌: జిల్లా మొదటి అదనపు జడ్జిగా ఎస్‌.సరిత, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా కిరణ్‌కుమార్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్‌ ఫ్యామిలీ కోర్టులో విధులు నిర్వహిస్తున్న సరిత కొత్తగూడెం కోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా, ఆమె జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌ వసంత్‌ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఇక సత్తుపల్లి సీనియర్‌ సివిల్‌ జడ్జి మీరా ఖాసీం నుంచి కిరణ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వీరిద్దరూ జిల్లా జడ్జి పాటిల్‌ వసంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సరిత, కిరణ్‌కుమార్‌కు రెండో అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కె.సాయిశ్రీ, స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ మెండు రాజమల్లు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ప్రదాన కార్యదర్శి భాగం మాధవరావు, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి మోహన్‌దాస్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

గృహ నిర్మాణాల్లో

నాణ్యత పాటించాలి

అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌

మణుగూరురూరల్‌/పినపాక : ఇందిరమ్మ గృహ నిర్మాణాల్లో నాణ్యత పాటించాలని అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌ అన్నారు. మణుగూరు మండలంలో నిర్మిస్తున్న ఇళ్లను బుధవారం ఆయన పరిశీలించారు. కాంట్రాక్టర్లు పనులు నాణ్యంగా చేపట్టాలే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం సాంబాయిగూడెం, పినపాక మండలం పొట్లపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను ఆయన దృష్టికి తేగా.. వారికి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని, సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లారీలను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ఆయన వెంట డీఎస్‌ఓ పి.రుక్మిణి దేవి, సివిల్‌ సప్లయీస్‌ డీఎం త్రినాథ్‌ బాబు, మణుగూరు తహసీల్దార్‌ రాఘవరెడ్డి, ఎంపీడీఓ టి.శ్రీనివాసరావు, సివిల్‌ సప్లయీస్‌ డీటీ శివకుమార్‌ ఉన్నారు.

ప్లాంటేషన్‌ను పరిశీలించిన విజిలెన్స్‌ డీఎఫ్‌ఓ

బూర్గంపాడు: ఇరవెండి, సారపాక అటవీ బీట్లలోని ప్లాంటేషన్లను విజిలెన్స్‌ డీఎఫ్‌ఓ ముకుందరెడ్డి బుధవారం పరిశీలించారు. మొక్కల ఎదుగుదల, అటవీ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అటవీ శాఖ అధికారులకు సూచించారు. వనసంరక్షణతో పాటు వన్యప్రాణి సంరక్షణకు చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో అశ్వాపురం ఎఫ్‌ఆర్‌ఓ రమేష్‌, సారపాక డీఆర్‌ఓ సుజాత, ఎఫ్‌బీఓ భీమ్‌చందర్‌ నాయక్‌ పాల్గొన్నారు.

కమనీయంగా  రామయ్య నిత్యకల్యాణం1
1/2

కమనీయంగా రామయ్య నిత్యకల్యాణం

కమనీయంగా  రామయ్య నిత్యకల్యాణం2
2/2

కమనీయంగా రామయ్య నిత్యకల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement