యువకుడు ఆత్మహత్య! నాలుగు రోజుల నుండి గదిలోనే.. ఇంతలో.. | - | Sakshi
Sakshi News home page

యువకుడు ఆత్మహత్య! నాలుగు రోజుల నుండి గదిలోనే.. ఇంతలో..

Aug 5 2023 12:20 AM | Updated on Aug 5 2023 9:05 AM

- - Sakshi

భద్రాద్రి: కుటుంబ కలహాల నేపథ్యాన భార్య వెళ్లిపోవడంతో మద్యానికి బానిసైన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పరిశీలించగా మూడు రోజుల తర్వాత విషయం బయటపడింది.

వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం ఫోర్‌ ఇంక్‌లైన్‌ ఏరియా క్యాంప్‌నకు చెందిన పంజార వెంకటేష్‌ రామవరానికి చెందిన యువతిని ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించగా, ఏడాదిన్నరగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రోజు మద్యం తాగొచ్చే ఆయన భార్యను కొడుతుండడంతో ఆమె పిల్లలతో సహా ఆరు నెలల నుంచి విడిగా ఉంటోంది.

అప్పటి నుంచి మద్యానికి మరింత బానిసైన కృష్ణ ఇంటికి నాలుగు రోజులుగా తాళం వేసి ఉండడంతో ఊరు వెళ్లాడని స్థానికులు భావించారు. కానీ శుక్రవారం ఉదయం దుర్వాసన వస్తుండడంతో కిటికీలు పగలగొట్టి చూడగా కృష్ణ ఉరి వేసుకుని కనిపించాడు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితికి చేరడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ రమేష్‌, సిబ్బంది చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement