ముగిసిన ఆహ్వాన నాటికల పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఆహ్వాన నాటికల పోటీలు

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

తెనాలి: కొలంకపురి నాటక కళాపరిషత్‌, శ్రీసాయి ఆర్ట్స్‌, కొలకలూరు సంయుక్త ఆధ్వర్యంలో కొలకలూరు పంచాయతి పరిధిలోని ఖాజీపేట కళావేదికపై జరుగుతున్న ఉభయ రాష్ట్రస్థాయి 12వ ఆహ్వాన నాటికల పోటీలు మంగళవారం రాత్రితో ముగిశాయి. చిటుమడుగుల సాంబయ్య కళాప్రాంగణంలో చిటుమడుగుల భాస్కరరావు జ్యోతి ప్రజ్వలనతో చివరిరోజు ప్రదర్శనలు ఆరంభించారు. రాత్రి ఏడుగంటలకు స్వర్ణ సూర్య డ్రామా లవర్స్‌, హైదరాబాద్‌ వారి ‘సీ్త్రమాత్రే నమః’ నాటికను ప్రదర్శించారు. పూర్ణిమ పెమ్మరాజు మూలకథకు ఉదయ్‌ భాగవతుల నాటకీకరించి, దర్శకత్వం వహించారు. రాత్రి 8 గంటలకు ఏర్పాటైన సభకు కళాపరిషత్‌ ఉపాధ్యక్షులు సుద్దపల్లి మురళీధర్‌ అధ్యక్షత వహించారు. సభలో గోపరాజు చక్రపాణి జీవిత సాఫల్య పురస్కారాన్ని కాకినాడకు చెందిన ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటుడు డాక్టర్‌ సీఎస్‌.ప్రసాద్‌కు బహూకరించారు. సభానంతరం స్నేహ ఆర్ట్స్‌–చంద్రమాంపల్లి, దివిలి వారి ‘పుట్టింటి సంపద’ నాటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు. స్నిగ్ధ రచనకు, బి.రాజు దర్శకత్వంలో పి.బాలాజీనాయక్‌ పర్యవేక్షణలో ప్రదర్శించారు. నిర్వాహక కమిటి తరపున గోపరాజు రమణ, గోపరాజు విజయ్‌, సుంకర శ్రీనివాసరావు, సుద్దపల్లి మురళీధర్‌ పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement