ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

Mar 13 2026 7:55 AM | Updated on Mar 13 2026 7:55 AM

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

నెహ్రూనగర్‌: వారంతా నాలుగు పదులకుపైగా వయస్సు గలవారు. వయస్సుతో పనిలేకుండా పరుగులెత్తారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పనిచేసే ఉద్యోగులకు మూడు రోజులపాటు స్పోర్ట్స్‌ మీట్‌ గురువారం పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ హనుమంతు, ఎకై ్సజ్‌ శాఖ డెప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ కె. శ్రీనివాసులు, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌లు అరుణకుమారి, మణికంఠలు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. మొదటి రోజు 50, 100, 200 మీటర్లు రన్నింగ్‌, 400 మీటర్లు వాకింగ్‌, టెన్నికాయిట్‌, ట్రిపుల్‌ జంప్‌, షాట్‌పుట్‌, జావెలిన్‌ త్రో, చెస్‌, క్యారమ్స్‌, వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. నేడు క్రికెట్‌ ఇతర క్రీడలు ఉంటాయని డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు దుర్గాప్రసాద్‌, శ్రీలత, ఏఈఎస్‌లు మారయ్యబాబు, రవీంద్రలు, రాష్ట్ర గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహ, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కామేశ్వరరావు, కానిస్టేబుల్స్‌ అండ్‌ హెడ్‌ కానిస్టేబుల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు రమణ, ఉమ్మడి గుంటూరు జిల్లా ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు యశోధర దేవి, ఉమ్మడి గుంటూరు జిల్లా కానిస్టేబుల్స్‌ అండ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కోటయ్య, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, మినిస్టీరియల్‌ సిబ్బంది, హెడ్‌ కానిస్టేబుల్స్‌, కానిస్టేబుల్స్‌ పాల్గొన్నారు.

ఎకై ్సజ్‌ శాఖ ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ మీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement